మెట్రో ఎఫెక్ట్: తాత్కాలికంగా పెరిగిన ఆర్టీసీ ఆదాయం!
- అదనంగా 20-25 వేల మంది బస్సు ప్రయాణికులు
- రోజుకు అదనంగా రూ.2 లక్షల ఆదాయం
- మెట్రో ఎక్కేందుకు ఆర్టీసీ బస్సులను ఆశ్రయించడమే కారణం
నగరంలోని 28 ఆర్టీసీ బస్ డిపోల నుంచి 1700 బస్సులు మెట్రో కారిడార్లోని ఏదో ఒక ప్రాంతం మీదుగా ప్రయాణిస్తున్నాయి. మెట్రో ఎక్కాలనుకునే ప్రజలు వీటిని వినియోగిస్తున్నారు. మరోవైపు మెట్రో స్టేషన్ల నుంచి కాలనీలకు ప్రత్యేక సర్వీసులు నడపాలని ఆర్టీసీ యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
మెట్రోలో ఎక్కి తిరగాలన్న నగరవాసుల తహతహతోపాటు, నగరానికి వస్తున్నవారు మెట్రో తొలి ప్రయాణ అనుభవం కోసం ఆరాటపడడం వల్లనే ఆర్టీసీ ఆదాయం పెరిగినట్టు భావిస్తున్నారు. అయితే, ఈ అదనపు ఆదాయం ఎంతకాలం కొనసాగుతుందనేది చూడాలి.