air india: ఎయిర్‌పోర్టులో ఎయిరిండియా ఉద్యోగిని కొట్టిన ప్రయాణికురాలు!

  • న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో ఘ‌ట‌న‌
  • టిక్కెట్‌ జారీ విషయంలో గొడ‌వ‌ప‌డ్డ ప్ర‌యాణికురాలు
  • మాటామాటా పెరిగి, ఉద్యోగినిపై చేయి చేసుకున్న వైనం 

విమానాశ్రయాల్లో ప్రయాణికులు నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని కేంద్ర విమాన‌యాన శాఖ ఈ మేర‌కు స్ప‌ష్ట‌మైన‌ ఆదేశాలు జారీ చేసిన విష‌యం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ అప్పుడప్పుడు కొన్ని చోట్ల ప్ర‌యాణికులు అనుచితంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు.

ఈ క్రమంలో న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో ఎయిరిండియా ఉద్యోగిపై ఓ ప్రయాణికురాలు రెచ్చిపోయింది. టిక్కెట్‌ జారీ విషయంలో గొడ‌వ‌పడింది. మాటామాటా పెరగడంతో, ఉద్యోగిపై ఆమె చేయిచేసుకుంది. ఆమె ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌ వెళ్ల‌డానికి ఎయిర్‌పోర్టుకి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఈ ఘటనపై అధికారులు విచారణ కొన‌సాగిస్తున్నారు.        

More Telugu News