India: పాకిస్థాన్ ఏ మాత్రం మారలేదని నిర్ధారణ అయింది!: భారత్
పాకిస్థాన్ ఏమాత్రం మారలేదని అర్థమైందని భారత్ మండిపడింది. ముంబై పేలుళ్ల సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడైన హఫీజ్ సయీద్ ను గృహ నిర్బంధం నుంచి విడుదల చేయడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ మాట్లాడుతూ, నిషేధిత ఉగ్రవాదులు సైతం స్వేచ్ఛగా విహరించగలిగేలా అక్కడి వాతావరణం ఉందని అన్నారు.
సయీద్ ను విడుదల చేయడంతో ఆ దేశం నిజస్వరూపం మరోసారి బట్టబయలైందని ఆయన వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితి గుర్తించిన నిషేధిత ఉగ్రవాద సంస్థకు చెందిన వ్యక్తి స్వేచ్ఛగా విహరించగలుగుతున్నాడంటే.. ఉగ్రవాద నిర్మూలనపై ఆ దేశానికున్న నిబద్ధత ఏ పాటిదో అర్థమవుతోందని ఆయన ఎద్దేవా చేశారు.
సయీద్ ను విడుదల చేయడంతో ఆ దేశం నిజస్వరూపం మరోసారి బట్టబయలైందని ఆయన వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితి గుర్తించిన నిషేధిత ఉగ్రవాద సంస్థకు చెందిన వ్యక్తి స్వేచ్ఛగా విహరించగలుగుతున్నాడంటే.. ఉగ్రవాద నిర్మూలనపై ఆ దేశానికున్న నిబద్ధత ఏ పాటిదో అర్థమవుతోందని ఆయన ఎద్దేవా చేశారు.