team india: టీమిండియా ఆటగాళ్లకు గుడ్ న్యూస్.. స్వదేశంలో కూడా బిజినెస్ క్లాస్ లో ప్రయాణ సౌకర్యం!

  • ఇండియాలో ఎకానమీ క్లాస్ లోనే ఇన్నాళ్లూ ఆటగాళ్ల ప్రయాణం
  • ఇప్పుడు బిజినెస్ క్లాస్ లో ప్రయాణించేందుకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్
  • తొలగనున్న ఆటగాళ్ల ఇబ్బందులు

భారత క్రికెటర్లకు బీసీసీఐ గుడ్ న్యూస్ తెలిపింది. స్వదేశం లో జరిగే మ్యాచ్ ల సమయంలో... ఇప్పటి వరకు విమానాల్లోని ఎకానమీ క్లాస్ లోనే మన క్రికెటర్లు ప్రయాణిస్తున్నారు. ఇక నుంచి వీరికి బిజినెస్ క్లాస్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది బీసీసీఐ. ఈ మేరకు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే నేతృత్వంలోని సీఓఏ కమిటీ తెలిపింది.

మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎకానమీ క్లాస్ లో ప్రయాణిస్తూ తాము చాలా అసౌకర్యానికి గురవుతున్నామని ప్లేయర్లు ఫిర్యాదు చేశారు. అంతేకాదు, తమతో సెల్ఫీలు దిగేందుకు తోటి ప్రయాణికులు ఇబ్బంది పెడుతున్నారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. విదేశాల్లో తాము పర్యటించేటప్పుడు సమకూర్చే బిజినెస్ క్లాస్ ప్రయాణాన్నే ఇండియాలో కూడా కల్పించాలని కోరారు. ఇప్పటిదాకా ఉన్న పద్ధతి ప్రకారం మన దేశంలో పర్యటిస్తున్నప్పుడు కెప్టెన్, కోచ్ లకు మాత్రమే బిజినెస్ క్లాస్ లో ప్రయాణించే అవకాశం ఉంది. మిగిలిన ఆటగాళ్లంతా ఎకానమీ క్లాస్ లోనే ప్రయాణించాలి. 

More Telugu News