padmavathi: మేము చూస్తూ ఊరుకోం.. ‘పద్మావతి’ సినిమాకి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటు హెచ్చ‌రిక‌!

  • రాణి పద్మినితో అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రేమాయణం నడిపినట్లు చూపించారు
  • అల్లావుద్దీన్ ఖిల్జీ దాడి చేయ‌డంతో 16 వేల మంది మహిళలు ఆత్మహత్యకు పాల్పడ్డారు
  • ఈ సినిమాను ప్ర‌ద‌ర్శిస్తే థియేట‌ర్ల‌ను త‌గుల‌బెడతాం
  • ఈ సినిమాను యువ‌త‌ బాయ్‌కాట్ చేయాలి

రాణి పద్మినితో అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రేమాయణం నడిపినట్లు చూపించారని ఆరోపిస్తూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ 'ప‌ద్మావ‌తి' సినిమాపై మండిప‌డ్డారు. సికింద్రాబాద్‌లోని రాజ్‌పుత్ కమ్యూనిటీలో మాట్లాడిన రాజాసింగ్ ఈ సినిమాను ప్రదర్శిస్తే థియేటర్లు తగలబెడతామని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ఈ సినిమా ద‌ర్శ‌కుడు బన్సాలీ కట్టుకథలు అల్లారని ఆయ‌న చెప్పారు. ఈ సినిమాను ముందుగానే రాజ్‌పుత్‌లకు చూపించాల‌ని, వాళ్ల అనుమతి తీసుకుంటేనే విడుద‌ల చేయాల‌ని అన్నారు.

ఇటీవ‌ల రాజాసింగ్ త‌న‌ అధికారిక ఫేస్‌బుక్ పేజ్‌లో పోస్ట్‌ చేసిన ఓ వీడియోలో ఈ వ్యాఖ్య‌లు ఉన్నాయి. ఈ సినిమాను యువ‌త‌ బాయ్‌కాట్ చేయాలని ఆయ‌న అన్నారు. చరిత్రలో జ‌రుగ‌ని విష‌యాల‌ను చూపిస్తే ఊరుకోబోమ‌ని చెప్పారు. నిజానికి ఖిల్జీ చిత్తోర్‌గఢ్‌పై దాడి చేశాడని, ఆ దాడితో 16 వేల మంది మహిళలు ఆత్మహత్యకు పాల్పడ్డారని రాజాసింగ్ తెలిపారు.

More Telugu News