సైకిల్ తొక్కి అలరించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు!
- గుంటూరు జిల్లా పేరేచర్లలో నగర వనం కార్యక్రమం
- 510 ఎకరాల్లో నిర్మించనున్న నగర వనం
- ఇందులో ఓపెన్ ఆర్ట్ థియేటర్, యోగా కేంద్రం, సైక్లింగ్ ట్రాక్, రెస్టారెంట్
- అంతేగాక పిల్లల కోసం అడ్వెంచర్ పార్కు, ట్రెక్కింగ్ వంటి సౌకర్యాలు
రాబోయే రోజుల్లో ఇది సందర్శకులను బాగా ఆకర్షిస్తుందని చెప్పారు. వారాంతంలోనే కాకుండా నిత్యం ప్రజలు సందర్శించేలా చేసేందుకు సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. అంతకు ముందు చంద్రబాబు సరదాగా సైకిల్ తొక్కారు. నవ్యాంధ్రను హరితాంధ్రగా మార్చాలన్నదే ప్రభుత్వ సంకల్పమని వ్యాఖ్యానించారు. 2029 నాటికి రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు.

