నామా నాగేశ్వరరావు: మహిళ చేసిన ఆరోపణలపై స్పందించిన నామా నాగేశ్వరరావు!

  • విజయవాడలో మీడియాతో మాట్లాడిన నామా
  • ఈ విషయం ఇప్పుడే నాకు తెలిసింది
  • నేనెవరినీ బెదిరించలేదు
  • ఈ కేసు రాజకీయం ఏంటో?
తన నగ్న చిత్రాలను బయటపెడతానని బెదిరిస్తున్నారంటూ ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు టీడీపీ నేత నామా నాగేశ్వరరావుపై హైదరాబాద్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నామా నాగేశ్వరరావు స్పందిస్తూ, టీడీపీ సమావేశం ఉండటంతో విజయవాడ వచ్చానని, ఈ విషయం తనకు ఇప్పుడే తెలిసిందని చెప్పారు. తానెవరినీ బెదిరించలేదని, ఈ కేసు వెనుక ఉన్న రాజకీయం ఏంటో తనకు తెలియదని, న్యాయపరంగానే తాను దీనిని ఎదుర్కొంటానని తెలిపారు. వాస్తవాలన్నీ త్వరలోనే బయటకొస్తాయని, ఒకరిని బ్లాక్ మెయిల్ చేయాల్సిన అవసరం తనకు లేదని, నలుగురికి సాయం చేసే మనస్తత్వం తనదని అన్నారు.
నామా నాగేశ్వరరావు
జూబ్లీహిల్స్

More Telugu News