వైసీపీ తీర్థం పుచ్చుకోనున్న కాంగ్రెస్ నేత దంతులూరి
- కాంగ్రెస్ కు రాజీనామా చేసిన పీసీసీ కార్యదర్శి
- నేడు జగన్ సమక్షంలో వైసీపీలో చేరిక
- ఆయన చేరికను వ్యతిరేకిస్తున్న కొందరు స్థానిక నేతలు
ఈరోజు జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకుంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత అయిన దంతులూరి రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి, ఓటమిపాలయ్యారు. 1995లో టీడీపీలో చేరిన ఆయన... మళ్లీ కొన్నిరోజులకే సొంతగూటికి చేరుకున్నారు.
మరోవైపు వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్ నాథ్ లు ఇటీవల దిలీప్ ఇంటికి వెళ్లి వైసీపీలో చేరాలని ఆహ్వానించారని, ఆయన సుముఖత వ్యక్తం చేశారని, దీంతో 12వ తేదీన వైసీపీలో చేరాలని ఆ రోజే నిర్ణయించినట్టు కూడా సమాచారం. అయితే, దిలీప్ రాకను కొంతమంది స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం.