ఆర్యవైశ్యులు: ఆర్యవైశ్యులు నాపై యుద్ధం ప్రకటించారు: కంచ ఐలయ్య

  • ఆ పుస్తకంలో అన్నీ వాస్తవాలే రాశా
  • కొనుగోలుదారుల్లోనే కాదు వడ్డీ వ్యాపారుల్లోనూ వాళ్లే  అధికం
  • డీమోనిటైజేషన్ దేశంలోనే అతిపెద్ద సోషల్ స్మగ్లింగ్
  • ఎస్సీ, ఎస్టీ, బీసీలు జాతీయవాదులు
  • నా కలం నా బొందలో కూడా రాస్తుంది

ఆర్యవైశ్యులు తనపై యుద్ధం ప్రకటించారని వివాదాస్పద రచయిత, మాజీ ప్రొఫెసర్ కంచ ఐలయ్య అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, భావ ప్రకటనా స్వేచ్ఛ తనకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని, తాను రాసిన ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ అనే పుస్తకంలో అన్నీ వాస్తవాలే ఉన్నాయని మరోమారు స్పష్టం చేశారు. మార్కెట్లలో 80 శాతం కొనుగోలుదారులు వైశ్యులే ఉంటారని, వడ్డీ వ్యాపారం చేసే వారిలోనూ వైశ్యులే ముందంజలో ఉంటారని, సామాన్యుల నుంచి ముక్కు పిండి మరి వడ్డీ వసూలు చేస్తారని ఆరోపించారు. ఈరోజు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో తన ఇంటి ముట్టడికి ప్రయత్నించారని, చర్చల పేరిట దాడులకు యత్నిస్తున్నారని అన్నారు.

గత నెల రోజులుగా మీడియా ముఖంగా, వ్యక్తిగతంగా ఫోన్ లో బెదిరింపులకు పాల్పడుతున్నారని, తనపై జరుగుతున్న దాడుల వెనుక బీజేపీ,అమిత్ షా హస్తం ఉందని ఆరోపించారు. అంబానీ, అమిత్ షాలు బనీయాలని ప్రకటించుకున్నారని, డీమోనిటైజేషన్ దేశంలోనే అతిపెద్ద సోషల్ స్మగ్లింగ్ అని, ఎస్సీ, ఎస్టీ, బీసీలు జాతీయవాదులని కంచ ఐలయ్య అభిప్రాయపడ్డారు. వైశ్య కంపెనీలకు జాతీయ భావాలుంటే వారి కంపెనీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జనాభా దామాషా ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఐలయ్య, ‘నా కలం నా బొందలో కూడా రాస్తుంది’ అని ఉద్వేగంగా మాట్లాడారు.

More Telugu News