kcr: జ‌ర్న‌లిస్టుల‌కు శుభ‌వార్త చెప్పిన కేసీఆర్‌!

  • రెండు లేక మూడు ప్ర‌దేశాల్లో వీలైతే ఒకేచోట వారికి ఇళ్ల స్థ‌లాలు
  • నెల‌ రోజులలోపే ఈ ప్ర‌క్రియ‌ను పూర్తి చేస్తాం
  • ఇళ్ల స్థ‌లాల ప‌రిశీలన జ‌రిగింది

ద‌స‌రా సంద‌ర్భంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ రోజు జ‌ర్న‌లిస్టుల‌కు శుభ‌వార్త చెప్పారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఈ రోజు సింగ‌రేణి కార్మికుల గురించి మాట్లాడిన కేసీఆర్‌.. అనంత‌రం జ‌ర్న‌లిస్టుల గురించి మాట్లాడారు. యాంక‌ర్లు, స‌బ్ ఎడిట‌ర్ల‌కే కాకుండా కెమెరా జ‌ర్న‌లిస్టుల వంటి వారికి కూడా ప్ర‌భుత్వ ప్ర‌యోజ‌నాలు అందేలా చేస్తామ‌ని అన్నారు.

రెండు లేక మూడు ప్ర‌దేశాల్లో వీలైతే ఒకేచోట వారికి ఇళ్ల స్థ‌లాల‌ను ఇస్తామ‌ని కేసీఆర్ అన్నారు. నెల‌ రోజులలోపే ఈ ప్ర‌క్రియ‌ను పూర్తి చేస్తామ‌ని చెప్పారు. ఇళ్ల స్థ‌లాల ప‌రిశీలన జ‌రిగిందని అన్నారు. జ‌ర్నలిస్టుల సంక్షేమం కోసం ఇస్తోన్న నిధుల‌ను పెంచుతామ‌ని అన్నారు.  

More Telugu News