జియో అభిమానులకు శుభవార్త.. రేపటి నుంచే ఫోన్ల డెలివరీ!
- తొలుత గ్రామీణ ప్రాంతాలకు సరఫరా
- 15 రోజుల్లో పంపిణీ పూర్తి
- మొత్తం 60 లక్షల ఫోన్ల డెలివరీ
- విశ్వసనీయ వర్గాల సమాచారం
జియో ఫీచర్ ఫోన్ను ఉచితంగా అందించనున్నట్టు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు. అయితే ఫోన్లు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు తొలుత రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్గా వసూలు చేయనున్నట్టు తెలిపారు. మూడేళ్ల తర్వాత ఆ సొమ్మును తిరిగి ఇచ్చేస్తారు. గత నెల 24న ఈ ఫోన్ల బుకింగ్స్ ప్రారంభం కాగా 60 లక్షల మంది బుక్ చేసుకున్నారు. బుకింగ్ సందర్భంగా రూ.500 చెల్లించారు. డెలివరీ సమయంలో మిగతా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.