: చెక్ బౌన్స్ కేసులో నందమూరి జయకృష్ణకు ఆరు నెలల జైలు శిక్ష, జరిమానా !

చెక్ బౌన్స్ కేసులో నందమూరి జయకృష్ణకు ఆరు నెలల జైలు శిక్ష, రూ.25 లక్షల జరిమానా విధిస్తూ హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ కోర్టు ఈ రోజు తీర్పు నిచ్చింది. అబిడ్స్ లోని రామకృష్ణ థియేటర్ క్యాంటీన్, పార్కింగ్ లీజ్ విషయంలో నర్సింగరావు అనే వ్యక్తికి జయకృష్ణ ఇచ్చిన రెండు చెక్కులు బౌన్స్ అయ్యాయి. దీంతో, ఎర్రమంజిల్ లోని మూడో మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టును నర్సింగరావు ఆశ్రయించగా, కోర్టు ఈ తీర్పును వెలువరించింది. ఈ తీర్పును పైకోర్టులో సవాల్ చేసుకునేందుకు వీలుగా శిక్ష అమలును నెల రోజులపాటు వాయిదా వేస్తూ జయకృష్ణకు బెయిల్‌ మంజూరు చేసింది. 

More Telugu News