: శరద్ యాదవ్ రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయండి: వెంకయ్యనాయుడికి జేడీయూ నేతల వినతి

జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్ రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడుకు ఆ పార్టీ నేతలు వినతిపత్రం అందజేశారు. రాజ్యసభలో జేడీయూ ఫ్లోర్ లీడర్ గా ఉన్న శరద్ యాదవ్ ను ఆ స్థానం నుంచి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తొలగించిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ఆర్సీపీ సింగ్ పేరును నితీష్ ప్రతిపాదించారు. మరోవైపు, బీజేపీతో నితీష్ కుమార్ జతకట్టడాన్ని నిరసిస్తూ... కొత్త పార్టీ పెట్టే యోచనలో శరద్ యాదవ్ ఉన్నారు.

More Telugu News