: దేశ వ్యాప్తంగా 800 ఇంజినీరింగ్ కాలేజీలు మూతపడబోతున్నాయి!

వచ్చే విద్యా సంవత్సరం నుంచి దేశ వ్యాప్తంగా 800 ఇంజినీరింగ్ కాలేజీలను మూసి వేస్తున్నట్టు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ అనిల్ దత్తాత్రేయ వెల్లడించారు. కాలేజీలో మౌలిక వసతులను కల్పించడంలో యాజమాన్యాలు విఫలం కావడం, ఆశించిన స్థాయిలో అడ్మిషన్లు లేకపోవడం తదితర కారణాల వల్లే అనుమతులు రద్దు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే ప్రతి ఏడాది 150 కాలేజీలు స్వచ్ఛందంగా మూత పడుతున్నాయని తెలిపారు. చాలా కాలేజీల్లో 30 శాతం కన్నా తక్కువ అడ్మిషన్లు జరుగుతున్నాయని చెప్పారు. కర్ణాటక, ఏపీ, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యాణా, తమిళనాడు, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో కాలేజీలు మూతపడుతున్నాయి. 

More Telugu News