: అప్పుడు, చంద్రబాబు నాకు ఎంత ముట్టజెప్పారో చెప్పాలి?: ముద్రగడ పద్మనాభం

తాను కాపు ఉద్యమం నడపడం వెనుక ఎవరో ఉన్నారని పదేపదే సీఎం చంద్రబాబునాయుడు అంటున్నారని, నాడు తాను కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉద్యమం నడిపించినప్పుడు అప్పుడు నాకు చంద్రబాబు ఎంత ముట్టజెప్పారో చెప్పాలని ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ఈ రోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 14న తమ జాతికి శుభవార్త చెబుతారని ఆనందించామని, కానీ, తమ జాతి చెవిలో అతిపెద్ద కాలీఫ్లవర్ పువ్వులు పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ జాతి చెవుల్లో పువ్వులు పెట్టడం మాని, రిజర్వేషన్లు ఇవ్వాలని, తమ జాతి ఆకలి తీరుస్తానని చెప్పి గత ఎన్నికల్లో ఓట్ల వేయించుకుని మమ్మల్ని ఎండలో నిలబెట్టారని విమర్శించారు. తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే విషయాన్ని గుర్తు చేయడం కోసమే ‘ఛలో అమరావతి’ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఏ వ్యక్తి అయినా వారి వయసు పెరిగే కొద్దీ హుందాగా, నిజాయతీగా వ్యవహరిస్తారని.. చంద్రబాబు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శించారు.

More Telugu News