: ఒక్క ఓటు తగ్గినా మనం మొగోళ్లమే కాదు, ఆడోళ్లమే అన్న శిల్పా చక్రపాణి రెడ్డి.. తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలు!

2004 ఎన్నికల్లో మనకు 49 వేల మెజార్టీ వచ్చిందని... ఈ ఎన్నికల్లో ఒక్క ఓటు తగ్గినా మనం మొగోళ్లమే కాదని, ఆడోళ్లమే అంటూ ఎన్నికల ప్రచారంలో శిల్పా చక్రపాణిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వేడిని పుట్టిస్తున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై నంద్యాల మహిళలు మండిపడుతున్నారు. శుక్రవారం రాత్రి శిల్పా మోహన్ రెడ్డి ఇంటిని చుట్టుముట్టిన మహిళలు, నిన్న రోజా ప్రచారాన్ని అడ్డుకున్నారు.

చక్రపాణితో క్షమాపణ చెప్పించకుండానే ప్రచారానికి ఎలా వచ్చారని 16వ వార్డులోని మహిళలు ఆమెను ప్రశ్నించారు. దీంతో, పోలీసులు జోక్యం చేసుకుని, ఆమెను వైసీపీ కార్యాలయానికి పంపించేశారు. ఏదేమైనప్పటికీ చక్రపాణి వ్యాఖ్యలు నియోజకర్గంలో చర్చనీయాంశంగా మారాయి. మహిళా ఓటర్లపై ఆయన వ్యాఖ్యలు ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. 

More Telugu News