: ధన్ రాజ్ లేదా ఆదర్శ్ ‘బిగ్ బాస్’ విన్నర్ అవుతారని భావిస్తున్నా: సింగర్ మధుప్రియ
‘బిగ్ బాస్’ విన్నర్ గా నటులు ధన్ రాజ్ లేదా ఆదర్శ్ ఎంపికవుతారని తాను అనుకుంటున్నానని సింగర్ మధుప్రియ అభిప్రాయపడింది. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘బిగ్ బాస్’ ఫైనల్స్ కు వీళ్లిద్దరిలో ఎవరో ఒకరు వస్తారని భావిస్తున్నాను. ‘బిగ్ బాస్’ ఏదీ ప్రీప్లాన్డ్ గా ఉండదు. ప్రతిదీ సర్ ప్రైజే. ఈ షోలో ఎవరితోనూ గొడవ పెట్టుకోకుండా ఉండాలి. అలా ఉంటేనే కరెక్టుగా ఉన్నట్టు. ఒకవేళ, ఆ విధంగా కాకుండా మనం ఎవరితోనైనా గొడవపడితే, మన మీద కన్ఫెషన్ రూమ్ లో ఫిర్యాదు చేస్తారు. ‘బిగ్ బాస్’ నుంచి నేను ఎలిమినేట్ అయ్యాక చాలామంది నాకు ఫోన్లు చేసి.. ‘అది స్క్రిప్టా?’ ‘మీరు నిజంగా ఏడ్చారా?’ అని అడిగేవారు. ఇదంతా రియల్, స్క్రిప్ట్ కాదు’ అని మధుప్రియ చెప్పుకొచ్చింది.