: గంగా, య‌మున‌ నదులకు ఆ హోదా ఇవ్వడం సరికాదు: స్పష్టం చేసిన సుప్రీంకోర్టు

దేశంలో తొలి జీవించి ఉన్న ప్రాణి గంగాన‌దేన‌ని ఈ ఏడాది మార్చి నెల‌లో ఉత్త‌రాఖండ్ హైకోర్టు తీర్పు ఇచ్చిన విష‌యం తెలిసిందే. దీంతో ఆ న‌దితో పాటు, య‌మున‌కు కూడా ఆ హోదా ల‌భించింది. దీంతో గంగా ప్ర‌క్షాళ‌న ప్రాజెక్ట్‌కు ప్రాధాన్య‌త పెరుగుతుంద‌ని కొంద‌రు భావించారు. అయితే, ఉత్త‌రాఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తిర‌స్క‌రించింది. ఈ రోజు దీనిపై విచార‌ణ జ‌రిపిన స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ఆ న‌దులు జీవం ఉన్న ప్రాణులు కావని స్ప‌ష్టం చేసింది. గంగ, య‌మునా నదుల వ‌ల్ల మాన‌వ‌జాతి వ‌ర్థిల్లుతున్న‌ద‌న్న విష‌యం నిజ‌మేన‌ని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు.. వాటిపై ఉన్న విశ్వాసాన్ని ఆధారంగా చేసుకుని మాత్రం జీవం ఉన్న వ్య‌క్తుల హోదాను ఇవ్వ‌లేమ‌ని తెలిపింది.   

More Telugu News