: శిరీష ఆత్మహత్య కేసులో క్లారిటీ కోసం నేడు శ్రవణ్ విచారణ!

హైదరాబాదులోని ఫిల్మ్ నగర్ ఆర్జీ స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడిన బ్యూటీషియన్ శిరీష కేసులో నిజానిజాలు వెలికి తీసేందుకు రాజీవ్, శ్రవణ్ ను వేర్వేరుగా విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు నిన్న ప్రధానంగా రాజీవ్ ను ఎక్కువసేపు విచారించారు. ఈ క్రమంలో నేడు శ్రవణ్ ను లోతుగా విచారించనున్నారు. నిన్న చంచల్ గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న పోలీసులు, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిన అనంతరం వారిని విడివిడిగా విచారించారు. ప్రధానంగా రాజీవ్ కు పోలీసులు పలు ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టారు. అనంతరం వారిద్దరినీ కలవనీయకుండా విడివిడిగా ఉంచారు. నేడు శ్రవణ్ ను విచారించనున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దర్నీ వేర్వేరుగా కుక్కునూరుపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకెళతారు. విచారణ మొత్తాన్ని వీడియో తీస్తున్నట్టు తెలుస్తోంది.

More Telugu News