: పాల్వాయి మృతితో పార్టీకి తీరని నష్టం: రాహుల్ గాంధీ

పాల్వాయి గోవర్ధన్ రెడ్డి హఠాన్మరణం పొందడంపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ‘పి.గోవర్ధన్ రెడ్డి జీ హఠాన్మరణం కాంగ్రెస్ పార్టీకి పెద్ద నష్టం. ఐదుసార్లు ఎమ్మెల్యేగా చేసి, ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్న ఆయన తెలంగాణ ఉద్యమంలో ముందు ఉండి నడిపించారు. నా సంతాపం తెలియజేస్తున్నాను’ అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.

More Telugu News