: జగన్ ను సీఎం చేసేందుకు కార్యకర్తలంతా సిద్ధం కావాలి: ఎంపీ మిథున్ రెడ్డి

2019 ఎన్నికల కోసం వైసీపీ నేతలు రెడీ అవుతున్నారు. ఈ రోజు అనంతపురం జిల్లా మడకశిరలో వైసీపీ ప్లీనరీ సమావేశం జరిగింది. నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తిప్పేస్వామి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ ప్లీనరీకి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు శంకర్ నారాయణ, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మిథున్ రెడ్డి మాట్లాడుతూ, జగన్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు కార్యకర్తలంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అమరావతి పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు అంతులేని అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీ, సచివాలయంలను ఏ మాత్రం నాణ్యత లేకుండా నిర్మించారని విమర్శించారు. అవినీతి రహిత పాలన రావాలనుకుంటే జగన్ రావాల్సిందేనని చెప్పారు. 

More Telugu News