: ఆఫ్ఘనిస్థాన్ లో మరో బాంబు పేలుడు.. ఏడుగురి మృతి.. 16 మందికి గాయాలు

ఆప్ఘ‌నిస్థాన్ లో మ‌రోసారి బాంబు పేలుడు సంభ‌వించింది. ఈ రోజు మ‌ధ్యాహ్నం ఓ మ‌సీదు వ‌ద్ద సంభ‌వించిన ఈ పేలుడు ధాటికి ఏడుగురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో 16 మందికి తీవ్ర‌గాయాల‌య్యాయి. ఈ పేలుడుపై అక్క‌డి అధికారులు మాట్లాడుతూ... మ‌సీదు గేటు వ‌ద్ద‌ ఓ మోటారు సైకిల్‌లో దుండ‌గులు బాంబు అమ‌ర్చార‌ని, అక్క‌డ ఓ కార్య‌క్ర‌మం జ‌రుగుతుండ‌గా ఈ పేలుడు సంభవించింద‌ని చెప్పారు. ఈ దాడికి బాధ్య‌త‌ వ‌హిస్తూ ఏ ఉగ్ర‌వాద సంస్థా ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. ఇటీవ‌ల ఆప్ఘ‌నిస్థాన్‌లో రోజుల వ్య‌వ‌ధిలోనే ప‌లుసార్లు బాంబు పేలుళ్లు సంభవించిన విష‌యం తెలిసిందే. త‌మ దేశంలో ప్ర‌తి రోజు ఎక్కోడచోట దాడులు జ‌రుగుతుండ‌డంతో అక్క‌డి ప్ర‌జలు తీవ్ర భ‌యాందోళ‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు.    

More Telugu News