: బోట్స్వానాలోనూ ఈవీఎంలది అదే పరిస్థితి.. ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్
ఈవీఎంల సవాలు నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తప్పుకున్నప్పటికీ వాటి ట్యాంపరింగ్పై మాత్రం తన ఆందోళనను కొనసాగిస్తోంది. 2019లో జరగనున్న ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ప్రవేశపెట్టేందుకు బోట్స్వానా ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం ఆ దేశంలో పర్యటిస్తున్న ‘ఆప్’ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ బోట్స్వానాలోనూ ప్రతిపక్ష పార్టీలు ఈవీఎంలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. ఈవీఎంల ట్యాంపరింగ్పై తాము వ్యక్తం చేసిన ఆందోళననే అక్కడి ప్రతిపక్ష పార్టీలు కూడా వ్యక్తం చేస్తున్నాయన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ నిజమని నమ్మించేందుకు ఉన్న లీగల్ అవకాశాలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఇటీవల ఢిల్లీ అసెంబ్లీలో భరద్వాజ్ ఈవీఎంలను ట్యాంపర్ చేసి చూపించిన సంగతి తెలిసిందే.