: కుమారుడి పనితీరును సమీక్షించనున్న చంద్రబాబు!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ మంత్రిత్వ శాఖలపై సమీక్షించనున్నారు. ఈ మూడు శాఖల బాధ్యతలనూ తన కుమారుడు లోకేష్ చేపట్టిన తరువాత, అధికారులపై, శాఖపై పట్టు పెంచుకునేందుకు సమయం ఇవ్వాలన్న ఆలోచనతో ఇన్ని రోజులూ లోకేష్ కార్యకలాపాల్లో చంద్రబాబు కల్పించుకోని సంగతి తెలిసిందే. లోకేష్ బాధ్యతలు చేపట్టి నెల రోజులు దాటిపోవడంతో ఆ శాఖలో పెండింగ్ పనుల పూర్తి, కొత్త ప్రాజెక్టులు, ఐటీ విస్తరణ, పల్లెలకు తాగునీరు, రోడ్ల నిర్మాణం తదితర అంశాలపై లోకేష్ కు వచ్చిన అవగాహనను చంద్రబాబు ఈ సమీక్షలో పరీక్షించనున్నట్టు తెలుస్తోంది. ఉదయం 11:30 గంటలకు సమీక్ష జరగనుండగా, మంత్రి లోకేష్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొననున్నారు.

More Telugu News