: గొట్టిపాటి ఓ నపుంసకుడు: కరణం బలరాం తీవ్ర వ్యాఖ్యలు

ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో వ్యక్తిగత కక్షలు మరోసారి భగ్గుమన్నాయి. ఎమ్మెల్సీ కరణం బలరాం, ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో బలరాం వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఘటన జరిగిన బల్లికురవ మండలం వేమవరం గ్రామంలో 144 సెక్షన్ విధించారు. ఈ సందర్భంగా కరణం బలరాం మీడియాతో మాట్లాడుతూ గొట్టిపాటిపై నిప్పులు చెరిగారు. గత 10 రోజుల నుంచి ఆయన చేస్తున్న చేష్టల ఫలితమే ఇదని మండిపడ్డారు. గొట్టిపాటి ఓ నపుంసకుడు అని అన్నారు. ఇలాంటి వ్యక్తులను పార్టీలో చేర్చుకున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

More Telugu News