: జైలుకు వెళ్లేముందు శశికళ సంచలన వ్యాఖ్యలు.. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపు.. బయటపెట్టిన జయానంద్!
అక్రమాస్తుల కేసులో దోషిగా తేలి బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి జైలుకు వెళ్లేముందు సంచలన వ్యాఖ్యలు చేసినట్టు ఆమె మేనల్లుడు జయానంద్ దివాకరన్ పేర్కొన్నారు. అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న జయలలిత ఫొటోలు కానీ వీడియోలు కానీ బయటపెడితే తాను ఆత్మహత్య చేసుకుంటానని శశికళ హెచ్చరించారని దివాకరన్ తెలిపారు.
ఈ మేరకు కుటుంబ సభ్యులను హెచ్చరించి మరీ ఆమె జైలుకు వెళ్లారని వివరించారు. జయలలిత ఫొటోలు బయటకు వచ్చినా, ఆమె అంతిమ ఘడియల ముందు ఆస్పత్రిలో జరిగిన వ్యవహారం బయటకు పొక్కినా, జయ మరణంపై విచారణ జరిపినా తాను ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారని దివాకరన్ పేర్కొన్నారు. దివాకరన్ తాజా వ్యాఖ్యలతో తమిళనాడు రాజకీయాల్లో మరోమారు కలకలం రేగింది.
ఈ మేరకు కుటుంబ సభ్యులను హెచ్చరించి మరీ ఆమె జైలుకు వెళ్లారని వివరించారు. జయలలిత ఫొటోలు బయటకు వచ్చినా, ఆమె అంతిమ ఘడియల ముందు ఆస్పత్రిలో జరిగిన వ్యవహారం బయటకు పొక్కినా, జయ మరణంపై విచారణ జరిపినా తాను ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారని దివాకరన్ పేర్కొన్నారు. దివాకరన్ తాజా వ్యాఖ్యలతో తమిళనాడు రాజకీయాల్లో మరోమారు కలకలం రేగింది.