: రక్త సేకరణ వాహనాలను ప్రారంభించిన చంద్రబాబు
సీఎం చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటన ముగించుకుని కృష్ణా జిల్లా గన్నవరం చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో రక్తసేకరణ వాహనాలను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో మొత్తం 13 జిల్లాల్లో పదమూడు రక్త సేకరణ వాహనాలను నడపాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కాగా, ఒక్కో వాహనం ఖరీదు రూ.40 లక్షలు. ఆయా జిల్లాల్లోని స్వచ్ఛంద సంస్థలు, కళాశాలల్లో ఏర్పాటు చేసే రక్తదాన శిబిరాల నుంచి రక్తం సేకరించేందుకు ఈ వాహనాలను వినియోగించుకోవచ్చు.