: రెండు రోజుల దీక్షకు దిగనున్న వైఎస్ జగన్

రైతుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోరుతూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి రెండు రోజుల దీక్ష‌కు దిగ‌న‌నున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పతనం అవుతున్నా స‌ర్కారు పట్టించుకోవడం లేద‌ని, అందుకోసమే త‌మ అధినేత గుంటూరులో ఈనెల 26, 27 తేదీలలో దీక్ష చేస్తారని వైసీపీ వ‌ర్గాలు పేర్కొన్నాయి. వ్యాపారులంతా క‌లిసి ఒక్క‌సారిగా ధ‌రలను తగ్గించడంతో రైతులు న‌ష్ట‌పోతున్నార‌ని వైసీపీ ఆరోపిస్తోంది. వారికి మ‌ద్ద‌తు ధ‌ర అందించాల‌ని డిమాండ్ చేస్తోంది.

  • Loading...

More Telugu News