: రేపు నా భార్యతోనూ గొడవలున్నాయంటారేమో: కేజ్రీవాల్

ఆమ్ ఆద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్ తో తనకు గొడవలు ఉన్నట్టు వచ్చిన వార్తలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. తాను ఎన్నడూ కుమార్ విశ్వాస్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేయలేదని అన్నారు. కుమార్ కేవలం పార్టీలో సభ్యుడు మాత్రమే కాదని, తన కుటుంబంలో ఓ వ్యక్తి వంటివాడని వెల్లడించిన కేజ్రీవాల్, రేపు తన భార్యతో కూడా గొడవలు ఉన్నాయని మీడియాలో రాసేస్తారేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. కుమార్ తో తన విభేదాల వార్తలు, ప్రసార మాధ్యమాల సృష్టేనని, వాస్తవ విరుద్ధమని స్పష్టం చేశారు. కాగా, కుమార్ పార్టీని వీడనున్నారని గత వారంలో మీడియాలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.

More Telugu News