: దినకరన్ 100 కోట్లు పంచాడు: శశికళ పుష్ప
ఆర్కే నగర్ ఉపఎన్నికలో శశికళ వర్గం తరపున బరిలోకి దిగిన దినకరన్ పై ఏఐఏడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు భారీ ఎత్తున డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు దాదాపు రూ. 100 కోట్లను ఖర్చు చేశారని తెలిపారు. ఈమేరకు ఆమె ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో, ఆర్కేనగర్ ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పలువురు నేతల ఇళ్లపై దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో, ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందనే ఉత్కంఠ అందర్లో నెలకొంది.