: పాకిస్థాన్ ప్రధానికి నరేంద్ర మోదీ శుభాకాంక్షల లేఖ
ఈ ఏడాది జనవరి 26న భారత్ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ పంపిన విషయం తెలిసిందే. అయితే, ఈ రోజు 77వ పాకిస్థాన్ డే సందర్భంగా భారత ప్రధాని మోదీ కూడా నవాజ్ షరీఫ్కి లేఖ పంపి శుభాకాంక్షలు చెప్పారు. ఈ రోజు పాకిస్థాన్ నేషనల్ డే సందర్భంగా ఇస్లామాబాద్లో జరిగిన వేడుకల్లో ఆ దేశాధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ తోపాటు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా పాల్గొన్నారు. అదేవిధంగా ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కార్యాలయంలో కూడా పాకిస్థాన్ రిపబ్లిక్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ హాజరయ్యారు.