: పళనిస్వామికి రాజ్ భవన్ నుంచి పిలుపు.. రిసార్టు నుంచి కదిలిన సీఎం అభ్యర్థి
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్న కేసులో శశికళ నటరాజన్ జైలుకి వెళ్లడంతో తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రభుత్వ ఏర్పాటుపై ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు 11.30కి తనని కలవాలంటూ అన్నాడీఎంకే శాసనసభ పక్షనేత పళనిస్వామికి గవర్నర్ నుంచి పిలుపువచ్చింది. దీంతో గోల్డెన్ బే రిసార్టులో ఉన్న పళనిస్వామి అక్కడి నుంచి పలువురు మంత్రులతో కలిసి రాజ్భవన్కు బయలుదేరారు. ఈ భేటీ తరువాత ఇక ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ ఓ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. పళనిస్వామికే ఆ అవకాశం ఇస్తారని అందరూ భావిస్తున్నారు.
నిన్న పళనిస్వామితో పాటు పన్నీర్ సెల్వంతో కూడా విద్యాసాగర్ రావు చర్చించిన విషయం తెలిసిందే. తనకి పార్టీలో మెజారిటీ ఉందని పళనిస్వామి గవర్నర్ తో ఆ సందర్భంగా తెలిపారు. మరోవైపు పన్నీర్ సెల్వంకి పార్టీలో అంతగా మెజార్టీ లేకపోవడంతో గవర్నర్ పళనిస్వామికే అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
నిన్న పళనిస్వామితో పాటు పన్నీర్ సెల్వంతో కూడా విద్యాసాగర్ రావు చర్చించిన విషయం తెలిసిందే. తనకి పార్టీలో మెజారిటీ ఉందని పళనిస్వామి గవర్నర్ తో ఆ సందర్భంగా తెలిపారు. మరోవైపు పన్నీర్ సెల్వంకి పార్టీలో అంతగా మెజార్టీ లేకపోవడంతో గవర్నర్ పళనిస్వామికే అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.