: ఢిల్లీలో సీఎం కేసీఆర్ బిజీబిజీ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 26, 27, 28 తేదీల్లో ఉస్మానియా యూనివ‌ర్సిటీ శ‌తాబ్ది ఉత్స‌వాలు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ప‌లువురు రాష్ట్ర‌ మంత్రుల‌తో క‌లిసి ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్... రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని క‌లిసి ఓయూకి రావాల‌ని ఆహ్వానించారు. అనంత‌రం కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కేసీఆర్ బృందం క‌లిసింది. ఓయూ శతాబ్ది ఉత్సవాలకు రావాలని, తెలంగాణలో జిల్లాకి ఒక‌ కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని వారు ఆయ‌న‌ను కోరారు. అలాగే రాష్ట్రానికి ఐఐఎం మంజూరు చేయాలని విజ్ఞ‌ప్తి చేశారు.

More Telugu News