: ఒబామా సర్కార్లా ఉదాసీనంగా వుంటామనుకుంటున్నారా?: అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ హెచ్చరిక
మొదట తమ వద్ద అణ్వాయుధాలు లేవని చెప్పిన ఇరాన్.. నిన్న ఓ ప్రకటన చేస్తూ తాము అణు క్షిపణి పరీక్ష నిర్వహించినట్లు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా ఇరాన్పై దృష్టి పెట్టాలని ప్రత్యేక నోటీసులు జారీ చేస్తూ సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చిందని అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మైఖెల్ ఫ్లిన్ పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ సర్కారులో ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారుగా ఆయన ఇటీవలే బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. తొలిసారిగా ఆయన మాట్లాడుతూ... బరాక్ ఒబామా సర్కారుని బహిరంగంగా విమర్శించారు.
ఇరాన్ చేస్తున్న విపరీత చర్యలపై ప్రతిస్పందించడంలో ఒబామా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు. ఆ కారణంగానే ఇప్పుడు ఇరాన్ ఇలా ప్రవర్తిస్తోందని చెప్పారు. ఇటీవల యెమెన్లో ఇరాన్ జరిపిన అణు క్షిపణుల పరీక్షలపై ఆయన స్పందిస్తూ.. టెహ్రాన్ దుశ్చర్యలకు ఇవి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ దేశం ఇప్పుడు తమది ఓ దుర్బలమైన దేశంగా భావిస్తోందని చెప్పారు. ఇందుకు గత ఒబామా సర్కార్ విఫలమవడమే కారణమని అన్నారు. తాము ఇకపై ఇరాన్ కదలికలను ఎప్పటికప్పుడు పసిగడతామని అన్నారు. అలాగే తాము బరాక్ ఒబామా ప్రభుత్వంలా ఉదాసీనంగా ఉండబోమని ఉద్ఘాటించారు.
ఇరాన్ చేస్తున్న విపరీత చర్యలపై ప్రతిస్పందించడంలో ఒబామా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు. ఆ కారణంగానే ఇప్పుడు ఇరాన్ ఇలా ప్రవర్తిస్తోందని చెప్పారు. ఇటీవల యెమెన్లో ఇరాన్ జరిపిన అణు క్షిపణుల పరీక్షలపై ఆయన స్పందిస్తూ.. టెహ్రాన్ దుశ్చర్యలకు ఇవి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ దేశం ఇప్పుడు తమది ఓ దుర్బలమైన దేశంగా భావిస్తోందని చెప్పారు. ఇందుకు గత ఒబామా సర్కార్ విఫలమవడమే కారణమని అన్నారు. తాము ఇకపై ఇరాన్ కదలికలను ఎప్పటికప్పుడు పసిగడతామని అన్నారు. అలాగే తాము బరాక్ ఒబామా ప్రభుత్వంలా ఉదాసీనంగా ఉండబోమని ఉద్ఘాటించారు.