: వ్యోమగామి ఎగ్యూన్ సెర్మన్ కన్నుమూత.. చంద్రునిపై కాలుమోపిన వారిలో చివరి వ్యక్తి ఆయనే!
డిసెంబర్ 1972లో 'అపోలో 17' మిషన్ లో భాగంగా చంద్రునిపైకి వెళ్లి వచ్చిన వారిలో చివరి వ్యక్తి ఎగ్యూన్ సెర్మన్ సోమవారం నాడు కన్నుమూశారు. తన 82 సంవత్సరాల వయసులో ఎగ్యూన్ వృద్ధాప్య కారణాలతో మరణించారని ఓ ప్రకటన వెలువడింది. ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నామని నాసా పేర్కొంది. కాగా, అపోలో మిషన్ కోసం అక్టోబర్ 1963లో 14 మంది ఆస్ట్రోనాట్ లను నాసా ఎంపిక చేయగా, అందులో ఎగ్యూన్ కూడా ఉన్నారు. జూన్ 1966లో 'జెమినీ 9' మిషన్ లో భాగంగా జరిగిన మూడు రోజుల అంతరిక్ష పర్యటనకు పైలట్ గా వ్యవహరించారు. ఆ సమయంలో రెండు గంటల పాటు ఆయన స్పేస్ వాక్ కూడా చేశారు. ఆపై అతనికి 'అపోలో 17'లో పర్యటించే అవకాశం వచ్చింది.