: అన్ని చోట్లా కోడి పందేలు జరుగుతుంటే... జేసీ ఇలాకా తాడిపత్రిలో మాత్రం వెరైటీ పోటీలు!

మనకు ఇప్పటి వరకు తెలిసింది కోడి పందేలు, పొట్టేళ్ల పందేలు, ఎడ్ల పందేలు లాంటివి మాత్రమే. కానీ, టీడీపీ ఎంపీ దివాకర్ రెడ్డి ఇలాకా తాడిపత్రిలో మాత్రం వెరైటీ పోటీలు జరుగుతున్నాయి. సరికొత్తగా పందుల పోటీలను తాడిపత్రిలో నిర్వహిస్తున్నారు. ఇలాంటి పోటీలు ఏ విదేశంలోనో జరిగితే పెద్ద న్యూస్ కాకపోయేది. కానీ, మన దగ్గర జరుగుతుండటం చాలా పెద్ద విశేషమే. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పందుల పోటీలు జరుగుతున్నాయి. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... ఈ పందుల పోటీలను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా జనాలు తరలిరావడం. పోటీలు జరుగుతున్న ప్రాంతమంతా జనాలతో నిండిపోయింది. 

More Telugu News