sakshi majaraj: ఆ వ్యాఖ్యలపై రేపటిలోగా వివరణ ఇవ్వాలి: సాక్షి మహరాజ్‌కు ఈసీ షోకాజ్ నోటీసులు

నలుగురు భార్యలు, 40 మంది పిల్లల్ని కంటూ ముస్లింలు దేశ జనాభాను శరవేగంగా పెంచేస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్‌పై ఎన్నిక‌ల క‌మిష‌న్ (ఈసీ) కేసు న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే.  త్వ‌ర‌లో ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న‌ నేప‌థ్యంలో ఆయ‌న చేసిన ఈ వ్యాఖ్య‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ ఈసీ ఆయ‌న‌ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించేలా వ్యాఖ్య‌లు చేశార‌ని తెలిపింది. ఆయ‌న రేపటి లోపు ఆ వ్యాఖ్య‌లపై వివరణ ఇచ్చుకోవాల‌ని తాజాగా ఆదేశాలు జారీచేసింది.
sakshi majaraj

More Telugu News