pawan kalyan : పవన్ కల్యాణ్ అభిమాన సంఘం నేత దాసరి రవి బైక్‌, ఫ్లెక్సీలు దగ్ధం.. పెట్రోల్‌ పోసి నిప్పంటించిన దుండగులు

కర్నూలు జిల్లా నంధ్యాల దేవనగర్‌లో ఉద్రిక్తత నెల‌కొంది. సినీన‌టుడు పవన్‌కళ్యాణ్‌ అభిమానసంఘం నేత దాసరి రవికి చెందిన‌ బైక్‌తో పాటు ప‌లు ఫ్లెక్సీలపై ప‌లువురు దుండ‌గులు పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. దీంతో ప‌వ‌న్ అభిమానులు, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు మండిప‌డ్డారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకొని కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇటువంటి ఘ‌ట‌న‌లు మ‌ళ్లీ జ‌ర‌గ‌కుండా చూడాల‌ని వారు పోలీసులను కోరారు.

More Telugu News

pawan kalyan
agitation