chandrababu: చంద్రబాబు పాల్గొన్న సభలో మిస్ఫైర్ అయిన ఏకే 47
కల్లూరు మండలం తడకనపల్లి వద్ద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్న ఓ సభలో ఈ రోజు అలజడి చెలరేగింది. సభలో ఓ తుపాకి మిస్ఫైర్ కావడంతో ప్రజలందరూ ఆందోళన చెందారు. ఆఖరికి స్పెషల్ పార్టీ పోలీసు కానిస్టేబుల్ హంపన్న చేతిలోని ఏకే 47 మిస్ ఫైర్ అయిందని గుర్తించారు. ఈ ఘటనలో హంపన్నకు తీవ్రగాయాలయ్యాయి. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.