: అందుకే, తనని ‘డాడీ బోయ్’ అని పిలుస్తా: దేవిశ్రీ ప్రసాద్

తన సోదరి కుమారుడిగా, తనకు మేనల్లుడిగా తండ్రి సత్యమూర్తి తమ కుటుంబంలో మళ్లీ చేరారని ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తన మేనల్లుడు తనవ్ సత్యను పరిచయం చేస్తున్నానని, ఈ చిన్నారికి తన తండ్రి సత్యమూర్తి పేరు పెట్టామని, బాబు రూపంలో తన తండ్రి తిరిగి వచ్చారని, అందుకే తన మేనల్లుడిని ‘డాడీ బోయ్’ అని పిలుస్తానని, అందరి ఆశీర్వాదాలు కావాలి అని ఆ ట్వీట్ లో దేవిశ్రీ పేర్కొన్నారు. తనవ్ సత్యతో కలిసి ఉన్న రెండు ఫొటోలను  పోస్ట్ చేశాడు. కాగా, దేవిశ్రీ ప్రసాద్ తండ్రి, ప్రముఖ మాటల రచయిత సత్యమూర్తి ఏడాది క్రితం మృతి చెందారు.

More Telugu News