: క్రిస్మస్ లో విషాదం... విషపూరితమైన మద్యం తాగి 32 మంది దుర్మరణం

క్రిస్మస్ వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. విషపూరితమైన మద్యం తాగి 32 మంది దుర్మరణం చెందారు. మరో 60 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన పాకిస్థాన్ లోని టోబాటెక్ సింగ్ నగరంలో ఉన్న ముబారకాబాద్ క్రీస్టియన్ కాలనీలో చోటు చేసుకుంది. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా వారంతా సరదాగా మద్యం సేవించారు. మృతుల్లో ఎక్కువ మంది క్రీస్టియన్లే ఉన్నారు. ఈ ఘటనకు కారకులైన తండ్రీకొడుకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసును దర్యాప్తు చేసేందుకు ఓ విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.

పాకిస్థాన్ లో ముస్లింలకు మద్యం అమ్మడంపై నిషేధం ఉంది. ఇతర మైనారిటీలకు, విదేశీయులకు మద్యం తాగడానికి అనుమతి ఉన్నా... కొన్ని కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. గత హోలీ వేడుకల్లో కూడా కల్తీ మద్యాన్ని తీసుకుని 45 మంది చనిపోయారు. వారిలో 35 మంది హిందువులే కావడం గమనార్హం.

More Telugu News