cricket: కోహ్లీ కంటే జో రూటే అత్యుత్తమ క్రికెట‌ర్: స్టువర్ట్‌ బ్రాడ్

ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ జో రూట్‌పై జ‌ట్టులోని అతని సహచరుడు స్టువర్ట్‌ బ్రాడ్ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించాడు. భారత స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లీ కంటే జో రూటే అత్యుత్తమ క్రికెట‌రని ఆయ‌న అన్నాడు. కోహ్లి, జో రూట్‌, స్టీవ్‌ స్మిత్‌(ఆస్ట్రేలియా) త్రయంలో అంద‌రిక‌న్నా జో రూటే త‌న దృష్టిలో అద్భుత ఆట‌గాడ‌ని ఆయ‌న చెప్పాడు. తాను జో రూట్‌తో కలసి ఎన్నో మ్యాచ్‌లు ఆడాన‌ని, జో రూట్‌కి ప్రతికూల పరిస్థితుల్లోనూ స్కోరు బోర్డును క‌దిలించ‌డం బాగా తెలుసని ఆయ‌న చెప్పాడు.

అయితే, ఇటీవల భార‌త్‌తో జ‌రిగిన టెస్టు సిరీస్‌లో విరాట్‌ కోహ్లీ ఆట‌తీరుకి తాను ముగ్ధుణ్ణయ్యానని వ్యాఖ్యానించాడు. కోహ్లీని నియంత్రించేందుకు త‌మ‌ బౌలర్లు ఎంతో క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింద‌ని చెప్పాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 నుంచి ఆస్ట్రేలియాతో భార‌త్ నాలుగు టెస్టుల సిరీస్‌ను ప్రారంభించ‌నున్న విష‌యం తెలిసిందే.

More Telugu News