: చెప్పిన మాట‌కు అనుగుణంగా నిధులు ఇచ్చారు: ఏపీ మంత్రి దేవినేని ఉమా

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌డుతున్న‌ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నాబార్డు తొలిదశ నిధులు అందజేయడంపై ఏపీ భారీనీటి పారుద‌ల శాఖ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌రరావు హర్షం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద ఎత్తున నాబార్డు ద్వారా నిధులు కేటాయించినందుకు కేంద్ర ప్ర‌భుత్వానికి ధ‌న్యవాదాలు తెలుపుతున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడితో పాటు ప‌లువురు కేంద్ర మంత్రులు చూపిన ప్ర‌త్యేక‌ చొర‌వ‌తో పోల‌వ‌రానికి నిధులు మంజూర‌య్యాయ‌ని ఆయ‌న అన్నారు. 2018 పూర్త‌య్యే నాటికి పోల‌వ‌రం ప్రాజెక్టులో నీరు నిల్వ చేస్తామ‌ని అన్నారు. రాయ‌ల‌సీమ రాబోయే రోజుల్లో ర‌త‌నాల సీమ కాబోతుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

More Telugu News