demonitization: బలవంతపు కుటుంబ నియంత్రణ పథకానికి పట్టినగతే నోట్లరద్దు నిర్ణయానికి పడుతుంది!: లాలూ ప్రసాద్ యాదవ్

షార్ట్స్‌లో చూడండి
కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న పెద్ద‌నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం విఫలమైందని ఆర్జేడీ అధ్య‌క్షుడు లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ విమ‌ర్శించారు. పెద్ద‌నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో ప్రధాని మోదీ చెప్పినట్లు 50 రోజుల గడువులోగా దేశ‌ ప్రజల ఇబ్బందులు తొల‌గక‌పోతే భారీ ఆందోళన చేపడతామని అన్నారు. దేశంలో ఎమర్జెన్సీ సమయంలో ఆనాటి కాంగ్రెస్ స‌ర్కారు చేపట్టిన బలవంతపు కుటుంబ నియంత్రణ (నశ్బందీ) పథకానికి ఏ గ‌తి ప‌ట్టిందో నోట్లరద్దు నిర్ణయానికి కూడా అదే గ‌తి పడుతుందని హెచ్చ‌రించారు. బీహార్‌లోని ఇతర పార్టీల‌తో క‌లిసి తాము భారీ ఆందోళ‌న‌కు దిగుతామ‌ని అన్నారు.
Go Back to Shorts
demonitization
lalu

More Telugu News