: ట్రయల్ రన్ లో ఢీకొన్న రెండు మెట్రో రైళ్లు
ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా రెండు మెట్రో రైళ్లు ఢీకొన్నాయి. ఢిల్లీ మెట్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెజెంటా ప్రాజెక్టులో ఈ ప్రమాదం జరిగింది. ట్రయల్ రన్ సందర్భంగా ఒకే ట్రాక్ పైకి వచ్చిన రైళ్లు ఢీకొన్నాయి. సిగ్నల్ వ్యవస్థలో లోపం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. అయితే, ప్రమాదానికి గల కారణాలను అధికారులు వెల్లడించలేదు. డ్రైవర్ రహిత రైళ్లను నడపడానికి ఢిల్లీ మెట్రో ఈ మెజెంటా లైన్ నిర్మాణాన్ని చేపట్టింది. జానక్ పురి వెస్ట్, బొటానికల్ గార్డెన్ ల మధ్య 25 స్టేషన్లను కలుపుతూ ఈ కొత్త కారిడార్ నిర్మితమవుతోంది. ఇటీవలే ఈ ట్రాక్ పై ట్రయల్ రన్ ను విజయవంతంగా నిర్వహించారు. కానీ, ఈ సారి మాత్రం రెండు రైళ్లు ఢీకొన్నాయి. 2017 మధ్యలో ఈ సేవలు ఢిల్లీ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.