: 150 పరుగులు పూర్తి చేసిన టీమిండియా
న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో 35.1 ఓవర్లు వద్ద టీమిండియా 150 పరుగులకు చేరుకుంది. పాండే ఔట్ అయిన తర్వాత 31.1 ఓవర్ లో జాదవ్ (41) పరుగులకు హెన్రీ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆ తర్వాత టీమిండియా కెప్టెన్ ధోనీ బ్యాటింగ్ కు దిగాడు. ప్రస్తుతం క్రీజ్ లో ధోనీ(35), అక్సర్ (8) కొనసాగుతున్నారు. లక్ష్యం సాధించాలంటే 81 బంతుల్లో టీమిండియా 84 పరుగులు చేయాల్సి ఉంది.