: చంద్రబాబు ఆస్తుల ప్రకటన కంటే పెద్ద జోక్ మరొకటి ఉండదు.. దేశంలోనే అత్యంత ధనికుడైన సీఎం చంద్రబాబు: భూమన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కుటుంబ ఆస్తుల వివరాలను నిన్న టీడీపీ యువనేత, చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్రెడ్డి ఆ అంశంపై విమర్శలు గుప్పించారు. లోకేశ్ చెప్పిందంతా అసత్యమేనని అన్నారు. దేశంలోనే అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని ఆరోపించారు. చంద్రబాబు ఆస్తుల ప్రకటన కంటే పెద్ద జోక్ మరొకటి ఉండదని అన్నారు. చంద్రబాబు ఆస్తుల ప్రకటన అంతా బోగస్ అని వ్యాఖ్యానించారు. దేశంలోనే అత్యధిక అవినీతి ముఖ్యమంత్రి కూడా చంద్రబాబేనని ఆయన ఆరోపించారు.