: నేటితో ముగియనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. మంగళవారం ఉదయం స్వామివారికి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించనున్నారు. సాయంత్రం ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. పుష్కరిణిలో ఎల్ఈడీ స్ర్కీన్లతోపాటు గజ ఈతగాళ్లను అధికారులు సిద్ధం చేశారు. ఉదయం 8 గంటల నుంచి 24 గంటలపాటు పుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించవచ్చు. ఇక రేపటి నుంచి స్వామి వారి ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను పునరుద్ధరించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు.

More Telugu News