: జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని విజ్ఞప్తి

హైదరాబాద్‌లోని అత్యంత రద్దీ ప్రదేశాల్లో ఒకటైన జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. మెట్రో రైలు నిర్మాణ పనుల కారణంగా నెల రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి సూచించారు. వాహనదారులు సహకరించాలని కోరారు. ఈ ప్రాంతంలో గత కొంతకాలంగా మెట్రో పనులు త్వరితగతిన జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే యూసఫ్‌గూడ చెక్‌పోస్టు వద్ద ఆంక్షలు విధించిన పోలీసులు తాజాగా జూబ్లీ చెక్‌పోస్టు వద్ద కూడా విధించడంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పేలా కనిపించడం లేదు.

More Telugu News