: హైదరాబాద్ నుంచి నాలుగు లారీల్లో వెలగపూడికి ఆర్థిక శాఖ ఫైళ్లు

వచ్చే నెల నుంచి అమరావతి నుంచే పాలన ప్రారంభించాలని కంకణం కట్టుకున్న ఏపీ ప్రభుత్వం అందుకోసం తీసుకుంటున్న చర్యలను మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే పలు శాఖలను తరలించిన ప్రభుత్వం తాజాగా మంగళవారం ఆర్థిక శాఖకు చెందిన ఫైళ్లు, కంప్యూటర్లను నాలుగు లారీల్లో హైదరాబాద్ నుంచి వెలగపూడికి తరలించారు. మరోవైపు సచివాలయంలోని రెండో బ్లాక్ మొదటి అంతస్తులో ఉన్న ఆర్థిక పరిపాలన చాంబర్‌లోని ఫైళ్లను కూడా సర్దుతున్నారు. మరో రెండు రోజుల్లో ప్రణాళిక శాఖ ఫైళ్లు కూడా హైదరాబాద్ నుంచి వెలగపూడికి చేరతాయి.

More Telugu News